జాబ్మేళాలో 122 మంది ఎంపిక
ABN , First Publish Date - 2022-09-29T06:24:26+05:30 IST
కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జాబ్మేళాలో 122 మందికి ఉద్యోగాలు లభించినట్టు ఉపాధి కల్పనాధికారులు కె.సుధ, సీహెచ్.సుబ్బిరెడ్డిలు పేర్కొన్నారు.
కంచరపాలెం, సెప్టెంబరు 28 : కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జాబ్మేళాలో 122 మందికి ఉద్యోగాలు లభించినట్టు ఉపాధి కల్పనాధికారులు కె.సుధ, సీహెచ్.సుబ్బిరెడ్డిలు పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-సీడాప్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ జాబ్మేళాకు 459 మంది నిరుద్యోగులు జిల్లా నలుమూలల నుంచి హాజరయ్యారు. వీరికి అర్హతలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించి 122 మందిని ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. డిమార్ట్, వైజాగ్ సెంట్రల్ వంటి షాపింగ్ మాల్స్, ఫార్మా రంగాలకు చెందిన 20 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఎంపికైన వారికి రీజనల్ ఎంప్లాయిమెంట్ అధికారిణి ఉమాదేవి, డీఆర్డీఏ పీడీ శోభారాణి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.