మరో 1,211 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-29T06:17:56+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
చికిత్స పొందుతూ ముగ్గురి మృతి
విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 4,048 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,211 మంది (29.92 పాజిటివిటీ రేటు)కి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,86,185కు చేరింది. శుక్రవారం 2,225 మంది కోలుకుని డిశ్చార్జ్ కావడంతో మొత్తం రికవరీల సంఖ్య 1,72,775కు చేరింది. కాగా చికిత్స పొందుతూ వరుసగా రెండో రోజూ కూడా ముగ్గురు మృతిచెందారు. వీటితో మరణాల సంఖ్య 1,138కు చేరింది. కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తున్నది