AP News: మాచర్ల ఘటనపై రెండు కేసులు

ABN , First Publish Date - 2022-12-17T20:15:45+05:30 IST

Palnadu: మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనపై మాచర్ల పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీడీపీ (TDP) నేత బ్రహ్మారెడ్డి సహా తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది.

AP News: మాచర్ల ఘటనపై  రెండు కేసులు

Palnadu: మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనపై మాచర్ల పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీడీపీ (TDP) నేత బ్రహ్మారెడ్డి సహా తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అందరిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చల్లా మోహన్ అనే రేషన్ డీలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బ్రహ్మారెడ్డిని ఏ1 గా చేర్చారు. బ్రహ్మారెడ్డి, బాబూ‌ఖాన్‌ తమపై రాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంటిపై దాడి చేసిన కేసులో అన్నపూర్ణ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో తురక కిషోర్‌తో పాటు మరి కొందరిపై 435 437 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-12-17T20:15:46+05:30 IST