కూల్చివేతలు, కుతంత్రాలతో వైసీపీ పాలన
ABN , First Publish Date - 2022-12-31T23:44:09+05:30 IST
కూల్చివేతలు, కుతంత్రాలతో వైసీపీ పాలన సాగుతోందని, దీనిని సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ కోరారు. సారవకోట మండలం నౌతళ, కొత్తూరు మండలం నేరడి పంచాయతీ జోగిపాడు, ఉప్పరపేటల్లో శనివారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి బృందం)
కూల్చివేతలు, కుతంత్రాలతో వైసీపీ పాలన సాగుతోందని, దీనిని సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ కోరారు. సారవకోట మండలం నౌతళ, కొత్తూరు మండలం నేరడి పంచాయతీ జోగిపాడు, ఉప్పరపేటల్లో శనివారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ నిర్వహించారు. వైసీపీ అరాచకాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. కార్యక్రమాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.