‘సమతుల్య ఎరువులను వినియోగించాలి’
ABN , First Publish Date - 2022-06-22T05:16:07+05:30 IST
సాగులో రైతులు సమతుల్య ఎరువులు వినియోగించాలని ఆమదాలవలస కృషివిజ్ఞాన కేంద్రం ప్రధానశాస్త్రవేత్త డి.చిన్నంనాయుడు పిలుపునిచ్చారు.
ఆమదాలవలస: సాగులో రైతులు సమతుల్య ఎరువులు వినియోగించాలని ఆమదాలవలస కృషివిజ్ఞాన కేంద్రం ప్రధానశాస్త్రవేత్త డి.చిన్నంనాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కేవీకేలో రైతులతో చర్చాగోష్టి నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్మపీడీ కె.కృష్ణారావు, ఆమదాలవలస వరిపరిశోధనా స్థానం ప్రధానశాస్త్రవేత్త టి.శ్రీలత, జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయ కర్త జె.జగన్నాథం, శాస్త్రవేత్తలు అమరజ్యోతి, జి.చిట్టిభాబు, ఎస్.నీలవేణి పాల్గోన్నారు.