మార్కెట్కు శ్రావణ శోభ
ABN , First Publish Date - 2022-08-05T05:41:19+05:30 IST
శ్రావణమాసం పురస్కరించుకుని.. గురువారం జిల్లావ్యాప్తంగా మార్కెట్లు కిటకిటలాడాయి. శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి అవసర మైన పూజాసామగ్రిని భక్తులు కొనుగోలు చేసుకున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్లోని పొట్టిశ్రీరాముల మార్కెట్, రైతుబజార్ రద్దీగా మారాయి.
నేడు వరలక్ష్మీ వ్రతం
పెరిగిన పూజాసామగ్రి ధరలు
(శ్రీకాకుళం కల్చరల్)
శ్రావణమాసం పురస్కరించుకుని.. గురువారం జిల్లావ్యాప్తంగా మార్కెట్లు కిటకిటలాడాయి. శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి అవసర మైన పూజాసామగ్రిని భక్తులు కొనుగోలు చేసుకున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్లోని పొట్టిశ్రీరాముల మార్కెట్, రైతుబజార్ రద్దీగా మారాయి. ఎన్నడూలేనంతగా పూజాసామగ్రితో పాటు పండ్లు, పూల ధరలు అమాంతం పెరిగాయి. అరటి పండ్లు డజను రూ.90, ఆపిల్, బత్తాయి, దానిమ్మ పండ్లు కిలో రూ.200 చొప్పున విక్రయించారు. బంతి, చామంతి పూలు 100 గ్రాములు రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయించారు. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారు ఇబ్బందులు పడ్డారు. అయితే పూజలు దృష్ట్యా కొనుగోలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి. గత మూడేళ్లుగా కొవిడ్ ప్రభావం ఉండడంతో ఆంక్షలు సాగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. శక్తికొలది బంగారం ఆభరణాలు, నూతన వస్త్రాలను కొనుగోలు చేశారు.