కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి

ABN , First Publish Date - 2022-03-05T05:50:22+05:30 IST

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి
కాశీబుగ్గ : అర్ధనగ్న ప్రదర్శనలో పాల్గొన్న పారిశుధ్య కార్మికులు

కాశీబుగ్గ : మునిసిపాలిటీలో కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను రెగ్యులర్‌ చేయాలని సీఐటీయూ జిల్లా కార్య దర్శి గణపతి డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద పారిశుధ్య కార్మికులు రెండో రోజు నిరసనలో భాగంగా శుక్రవారం అర్థ నగ్న ప్రదర్శన చేపట్టారు. మునిసిపల్‌ కార్మికులకు రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు మురుగన్‌ రవి, రమేష్‌, శుకుంతల, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


11న ‘చలో విజయవాడ’  

రాజాం రూరల్‌: మునిసిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 11న నిర్వహించనున్న చలో విజయవాడను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్య దర్శి రామ్మూర్తి నాయుడు కోరారు. రాజాంలో ఏపీ మున్సిపల్‌ వర్క ర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ఉద్యోగ, ఉపా ధ్యా యులకు మొండిచేయి చూపిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్రీనివాసరావు, అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T05:50:22+05:30 IST