‘మట్టిరోడ్లుగా మార్చిన ఘనత ఎమ్మెల్యేదే’

ABN , First Publish Date - 2022-11-11T23:44:35+05:30 IST

తారు రోడ్లను మట్టి రోడ్లుగా మార్చిన ఘనత ఎమ్మెల్యే రెడ్డి శాంతికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ విమర్శించారు. కారిగూడ పంచాయతీ అలికాం-బత్తిలి, కె.గుమ్మడ రోడ్లను శుక్రవారం పరిశీలించారు.

‘మట్టిరోడ్లుగా మార్చిన ఘనత ఎమ్మెల్యేదే’
కొత్తూరు: రోడ్డుపై మట్టిని చూపిస్తున్న కలమట వెంకటరమణ

కొత్తూరు: తారు రోడ్లను మట్టి రోడ్లుగా మార్చిన ఘనత ఎమ్మెల్యే రెడ్డి శాంతికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ విమర్శించారు. కారిగూడ పంచాయతీ అలికాం-బత్తిలి, కె.గుమ్మడ రోడ్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీ పీ హయాంలో వేసిన తారు రోడ్లు ఎమ్మెల్యే రెడ్డి శాంతి వచ్చిన తర్వాత మట్టి రోడ్లుగా మారాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు గెడ్డవలస కమలాకర్‌, మునుకోటి సీతారామ మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:44:37+05:30 IST