AP News: మహా పాదయాత్రపై మంత్రి ధర్మాన అనుచిత వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-10-07T20:17:08+05:30 IST
మహా పాదయాత్రపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా (Srikakulam Dist.): అమరావతి (Amaravathi) రాజధాని సాధన కోసం రైతులు (Farmers) చేపట్టిన మహా పాదయాత్ర (Maha Padayatra)పై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పీక కోసేటందుకు అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్రగా వస్తున్నారా?.. మా ప్రాంతం అభివృద్ధి చెందవద్దా?.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు.. విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి..’’ అంటూ మంత్రి ధర్మాన వ్యాఖ్యలు చేశారు.