‘ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం’
ABN , First Publish Date - 2022-12-09T23:33:48+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. శుక్రవారం రాత్రి బలరాంపురంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వ హించారు.
గార: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. శుక్రవారం రాత్రి బలరాంపురంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వ హించారు. ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. సర్పంచ్ మల్లేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.