పాఠశాలను విలీనం చేయవద్దు
ABN , First Publish Date - 2022-01-21T05:25:21+05:30 IST
మండలంలోని మహంతిపాలెం యూపీ స్కూల్ను గొర్లెపేట హైస్కూల్లో విలీనం చేయవద్దంటూ మహంతిపాలెం గ్రామస్థులు గురువా రం ఎంపీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
మహంతిపాలెం గ్రామస్థుల ఆందోళన
రణస్థలం:
మండలంలోని మహంతిపాలెం యూపీ స్కూల్ను గొర్లెపేట హైస్కూల్లో విలీనం
చేయవద్దంటూ మహంతిపాలెం గ్రామస్థులు గురువా రం ఎంపీడీపీ కార్యాలయం ఎదుట
ఆందోళన చేశారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను గ్రామంలోని
ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామ న్నారు. ఇప్పుడు 3 నుంచి 8వ తరగతి వరకు
చదువుతున్న 130 మంది విద్యా ర్థులను సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని
గొర్లెపేట హైస్కూల్కు పంపించడం తగదని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ
ఆలోచనను ప్రభుత్వం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు తమ పిల్లలను
పాఠశాలకు పంపించమన్నారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.