పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి

ABN , First Publish Date - 2022-11-19T23:56:13+05:30 IST

పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఎంపీడీవో సురేష్‌కుమార్‌, ఆర్ట్స్‌ సంస్థ డైరెక్టర్‌ సన్యాసిరావు పేర్కొన్నారు.

పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి

బూర్జ: పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఎంపీడీవో సురేష్‌కుమార్‌, ఆర్ట్స్‌ సంస్థ డైరెక్టర్‌ సన్యాసిరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో చైల్డ్‌లైన్‌ సే దోస్త్‌ వారోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ శాంతికుమారి, ఏఎస్‌ఐ ఎల్లయ్య పాల్గొన్నారు.

ఇచ్చాపురం: ఇచ్ఛాపురంలో చైల్డ్‌లైన్‌ సే దోస్త్‌ వారోత్సవాల్లో భాగంగా శనివారం విద్యార్థులకు సెల్‌ఫోన్లు వాడకం, బాలలతో స్నేహపూరిత వాతావరణం మెలగడం, చైల్డ్‌లైన్‌ చట్టాలపై చైల్డ్‌లైన్‌ కోఆర్డి నేటర్‌ జాస్మిన్‌ కుమారి అవగాహనకల్పించారు. కార్యక్రమంలో జోహర్‌ఖాన్‌, చైల్డ్‌ లైన్‌ సిబ్బంది జాన్సీ, సంతోష్‌, ఏఎస్‌ఐ సింహాచలం పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T23:56:16+05:30 IST