అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడాలి
ABN , First Publish Date - 2022-12-06T23:47:56+05:30 IST
రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో అప్రజాస్వామిక పాలన సాగు తోందని, దీనికి చరమగీతం పాడాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. మంగళవారం బూరగాంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క అవకాశం పేరు తో అధికారంలోకి వచ్చి జగన్ ప్రజలను దగా చేశారని విమర్శిం చారు.
కంచిలి: రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో అప్రజాస్వామిక పాలన సాగు తోందని, దీనికి చరమగీతం పాడాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. మంగళవారం బూరగాంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క అవకాశం పేరు తో అధికారంలోకి వచ్చి జగన్ ప్రజలను దగా చేశారని విమర్శిం చారు. నిత్యా వసర సరుకుల ధరలు పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా రన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కరప త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామేష్రెడ్డి, అప్పా రావు, రాజేశ్వరి, జగదీష్ పట్నాయక్, రామారావు, మన్మథరావు, సూర్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.