MLC Ashok Babu: ఒకే అడ్రస్పై అంతమంది ఓటర్లా?
ABN , First Publish Date - 2022-12-13T16:35:11+05:30 IST
Amaravathi: తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావలిలో అధికార పార్టీ అనర్హులను ఓటర్లుగా చేర్చిందని టీడీపీ (TDP) ఎమ్మెల్సీ అశోక్ బాబు
Amaravathi: తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావలిలో అధికార పార్టీ అనర్హులను ఓటర్లుగా చేర్చిందని టీడీపీ (TDP) ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. కావాలిలో ఒకే అడ్రస్తో దాదాపు 170 ఓటర్లను నమోదు చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. డిగ్రీ పూర్తయి 3 సంవత్సరాలు పూర్తయిన వారు మాత్రమే అర్హులని అశోక్ బాబు పేర్కొన్నారు. ఈసీ స్పందించకపోతే న్యాయపోరాటానికి సైతం వెనుకడబోమని స్పష్టం చేశారు.