YS Jagan అవుట్డేటెడ్.. నోరు జారిన మంత్రి..
ABN , First Publish Date - 2022-05-29T18:15:13+05:30 IST
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageswar Rao) గన్నవరం..
విజయవాడ : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageswar Rao) గన్నవరం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) తీవ్ర విమర్శలు చేస్తున్న సందర్భలో తమ అధినేత జగన్పై (CM YS Jagan) నోరు జారారు. జగన్మోహనరెడ్డి అవుట్డేటెడ్ అయిపోయాడు...అని రెండు సార్లు సంబోధించారు. వాస్తవానికి ఆయన ఈ వ్యాఖ్యలు చంద్రబాబుపై చేసే క్రమంలో పొరపాటున జగన్ పై చేశారు.
సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం ఎస్సీ, బీసీ, మైనారిటీ మంత్రుల బృందం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చేరుకుంది. అక్కడనుంచి కృష్ణాజిల్లా గన్నవరం వచ్చింది. తర్వాత విజయవాడ బెంజ్సర్కిల్కు, అక్కడినుంచి గుంటూరు మీదుగా చిలకలూరిపేట.. అక్కడినుంచి నరసరావుపేటకు చేరుకుంది. నరసరావుపేట సభలో మంత్రులు మాట్లాడారు. అంతకుముందు గన్నవరం సభలో మాట్లాడిన మంత్రి కారుమూరి పై వ్యాఖ్యలు చేశారు.