గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-12-31T22:26:30+05:30 IST

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఎమ్మెల్యే బు ర్రా మధుసూదన్‌యాదవ్‌ కోరారు. అ నిల్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో శనివా రం వలంటీర్లు, కన్వీనర్లతో ప్రత్యేక స మావేశం నిర్వహించారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఎమ్మెల్సీ అభ్యర్థిని పరిచయం చేస్తున్న ఎమ్మెల్యే బుర్రా

ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌

పామూరు, డిసెంబరు 31 : వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఎమ్మెల్యే బు ర్రా మధుసూదన్‌యాదవ్‌ కోరారు. అ నిల్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో శనివా రం వలంటీర్లు, కన్వీనర్లతో ప్రత్యేక స మావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా బుర్రా వలంటీర్లు, కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు. ఎవరి ప రిధిలో వారు పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. పథకాలు పొందిన లబ్ధిదారులతో కన్వీనర్లు సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. అనంతరం తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎ మ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. పేర్నాటి గెలుపునకు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ గంగసాని లక్ష్మీ, హుస్సేన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు సీహెచ్‌ సు బ్బయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ పువ్వాడి వెం కట సుజాత, రాంబాబు, వైస్‌ ఎంపీపీలు రషీద్‌, ఏసురత్నం, ఎంపీటీసీ సభ్యులు అబ్దుల్లా, వెంకటేష్‌, శ్రీను, ఉపసర్పంచ్‌లు సాయి, శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌ గురవయ్య కో ఆష్షన్‌ సభ్యుడు ఖాజా నాయబ్‌ రసూల్‌, చాంద్‌బాషా, సుబ్బారావు, రామిరెడ్డి, భాస్కరరెడ్డి, సలీం, నాయబ్‌ రసూల్‌, అజయ్‌ పాల్గొన్నారు.

అభివృద్ధిలో వైసీపీదే ముఖ్యపాత్ర

కనిగిరి, డిసెంబరు 31 : కనిగిరి అభివృద్ధిలో వైసీపీదే ముఖ్యపాత్ర అని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనిగిరి మున్సిపాల్టీతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వసతుల కల్పనకు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మె రుగుపర్చడంతోపాటు ప్రజలకు సేవలందించామన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలు, రైతులు సంతో షంగా ఉండాలని బుర్రా ఆకాంక్షించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ క మిషనర్‌ నారాయణరావు, మేనేజరు ప్రసాద్‌, టీపీఎస్‌ వివేకానంద, సిబ్బంది, చైర్మన్‌ గఫార్‌, వైస్‌ చైర్మన్‌ శాంతి, మాణిక్యరావు, కౌన్సిలర్లు తమ్మినేని సుజాత, శ్రీరామ సతీష్‌, దేవకి రాజీవ్‌, రిజ్వానా, పసుపులేటి దీప, రామనబోయిన ప్రశాంతి, దేవకి సత్యవతి, కోఆప్షన్‌ సభ్యుడు శ్రీనివాసులుయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:29:36+05:30 IST