జడ్పీకాలనీలో రూ.10లక్షల సొత్తు చోరీ
ABN , First Publish Date - 2022-08-18T05:36:53+05:30 IST
ఒంగోలు నగరం జిల్లాపరిషత్ కాలనీలో గుర్తు తెలియని దుం డగులు సుమారు రూ.10లక్షల సొత్తును చోరీ చేశారు. ఈ సం ఘటన మంగళవారం రాత్రి జరి గింది.
ఒంగోలు(క్రైం), ఆగస్టు17: ఒంగోలు నగరం జిల్లాపరిషత్ కాలనీలో గుర్తు తెలియని దుం డగులు సుమారు రూ.10లక్షల సొత్తును చోరీ చేశారు. ఈ సం ఘటన మంగళవారం రాత్రి జరి గింది. పోలీసుల కథనం మేరక.. స్థానిక జిల్లాపరిషత్ కాలనీ మూడోలైన్లో ఉంటే ఏవీఎస్.శ ర్మ, కుసుమ కుమారి దంపతులు బెడ్రూమ్లో పడుకున్నారు. అయితే ఇంటికి ఓ పక్క తలుపు తీసి ఉండటంతో దొంగలు సులువుగా చొరపడ్డారు. ఇంట్లో హాలులో గల అరమరల్లో సుమారు 24 సవర్ల బంగారం, రూ.15వేలు నగదు ఉన్న విష యాన్ని గుర్తించి అపహరించుకుని వెళ్లారు. బుధవారం ఉదయం నిద్ర లేచిన శర్మ దంపతులు హాలులో అరలు అన్నీ బయటకు లాగి ఉండటంతో నివ్వరపోయారు. సొత్తు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ శ్రీనివాసరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.