ఇతర రాష్ట్రాల్లోనూ టీడీపీకి ఆదరణ
ABN , First Publish Date - 2022-06-27T05:06:53+05:30 IST
ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన తెలుగు ప్రజలు టీడీపీ పై ఆభిమానం చాటుకుంటున్నారు.
చెన్నైలో సభ్యత్వాలు తీసుకున్న రాళ్లపల్లి వాసులు
వెలిగండ్ల, జూన్ 26 : ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన తెలుగు ప్రజలు టీడీపీ పై ఆభిమానం చాటుకుంటున్నారు. మండలంలోని రాళ్లపల్లి గ్రామానికి చెందిన కొంతమంది జీవనోపాధి కోసం చెన్నైకి వలస వెళ్లారు. దీంతో రాళ్లపల్లికి చెందిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు తగరం రాజారత్నం, మండల రైతు అధ్య క్షుడు కాశయ్య అదివారం చెన్నై వెళ్లారు. అక్కడ ఉంటున్న 150 మంది గ్రా మస్థులు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం వల్ల కుటుంబానికి కలిగే ప్రయోజనాలను నాయకులు వివరించారు. అనంతరం సభ్యత్వం పొందిన వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించు కుంటామని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న వారిని గుర్తించి సభ్య త్వాలను పూర్తి చేస్తామని నాయకులు తెలిపారు.