సరఫరా పునరుద్ధరణ!
ABN , First Publish Date - 2022-08-10T05:55:05+05:30 IST
బిల్లుల బకాయిలు చెల్లించే గడువును వచ్చేనెల 10 వరకు విద్యుత్ శాఖ పొడిగించింది. ఆ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, పథకాలకు సరఫరాను పునరుద్ధరించింది.
బకాయిల చెల్లింపునకు వచ్చేనెల 10వరకు గడువు పొడిగింపు
కలెక్టర్తో సమావేశమైన విద్యుత్ అధికారులు
బడ్జెట్ తెచ్చుకోవాలని ఇతర శాఖలకు ఆదేశాలు
ఒంగోలు (క్రైం), ఆగస్టు 9 : బిల్లుల బకాయిలు చెల్లించే గడువును వచ్చేనెల 10 వరకు విద్యుత్ శాఖ పొడిగించింది. ఆ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, పథకాలకు సరఫరాను పునరుద్ధరించింది. ‘బడ్జెట్ లేదు బకాయిలెలా..?’ అన్న శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ దినేష్కుమార్ స్పందించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఈ సత్యనారాయణ, ఇతర అధికారులు బకాయిల గురించి కలెక్టర్కు వివరించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఫోన్లో సంప్రదించారు. చాలా శాఖలకు బడ్జెట్ సమస్య ఉందని, వచ్చేనెల 10 వరకు గడువు ఇవ్వాలని కోరారు. వారు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖలకు కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని, బకాయిలు ఉన్నవారు బడ్జెట్ను తెప్పించుకునేందుకు ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని కోరారు. వచ్చేనెల 10లోపు బకాయిలను చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, రక్షిత మంచినీటి పఽథకాలకు విద్యుత్ సరఫరాను ఆ శాఖ అధికారులు పునరుద్ధరించారు.