టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , First Publish Date - 2022-08-10T04:08:54+05:30 IST
టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి ఎంఎం కొండయ్య అన్నారు.
చీరాల, ఆగస్టు 9 : టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి ఎంఎం కొండయ్య అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళవారం పేరాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి గోరంతయితే, చెప్పేది కొండంతగా ఉంటుందని ఎద్దేవా చేశారు. భవిష్యత్ తరాల అభ్యున్నతి, అమరావతి రాజధాని ప్రక్రియ కొనసాగింపు, ఏదైనా చంద్రబాబు సీఎం అయితేనే సాధ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. అన్ని ధరలు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి.చంద్రమౌళి, అందె ఉమామహేశ్వరరావు, గంజి పురుషోత్తం, డేటా నాగేశ్వరరావు, కౌతవరపు జనార్దనరావు, కూరపాటి పూర్ణ, ఉసురుపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.