మానసిక ఉల్లాసానికి క్రీడలు
ABN , First Publish Date - 2022-01-18T05:41:18+05:30 IST
మానసిక వికాసానికి, ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొల్లా మాల్యాద్రి చౌదరి, సింగిల్విండో మాజీ చైర్మన్ బైరెడ్డి జయరామిరెడ్డిలు అన్నారు. సంక్రాంతి పండుగలో భాగంగా మండలంలోని గుమ్మళంపాడు గ్రామంలో స్వర్గీయ పువ్వాడి రాధాకృష్ణ జ్ఞాపకార్థం నియోజకవర్గస్థాయిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రికెట్ జట్లకు సోమవారం బహుమతులు అందజేశారు.
పామూరు, జనవరి 17: మానసిక వికాసానికి, ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొల్లా మాల్యాద్రి చౌదరి, సింగిల్విండో మాజీ చైర్మన్ బైరెడ్డి జయరామిరెడ్డిలు అన్నారు. సంక్రాంతి పండుగలో భాగంగా మండలంలోని గుమ్మళంపాడు గ్రామంలో స్వర్గీయ పువ్వాడి రాధాకృష్ణ జ్ఞాపకార్థం నియోజకవర్గస్థాయిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రికెట్ జట్లకు సోమవారం బహుమతులు అందజేశారు. టోర్నమెంట్లో మొత్తం 28 క్రికెట్ జట్లు పాల్గొనగా వాటిలో బొట్లగూడూరు జట్టు మొదటి బహుతి సాధించగా పువ్వాడి రామకృష్ణ రూ. 15,116లు, గుమ్మళంపాడు జట్టు ద్వితీయ బహుమతి సాధించగా మాజీ ఉపసర్పంచ్ గుంటుపల్లి శ్రీనివాసులు రూ. 10,116లు, రావిగుంటపల్లి జట్టు తృతీయ శ్రేణిలో రాణించగా సింగిల్విండో మాజీ చైర్మన్ బైరెడ్డి జయరామిరెడ్డి రూ. 7,116లతో పాటు ట్రోపీని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా బహుమతులు అందజేసిన దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి కె సుభాషిణి, జిల్లా షీప్ సొసైటీ డైరెక్టర్ ఎం. గంగరాజుయాదవ్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఖాజారహంతుల్లా, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు టీవీకే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.