టీడీపీ సభ్యత్వ నమోదుకు స్పందన

ABN , First Publish Date - 2022-07-03T04:10:34+05:30 IST

తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభి స్తోందని పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య అన్నారు.

టీడీపీ సభ్యత్వ నమోదుకు స్పందన
టీడీపీ నమోదులో గ్రామస్థులు

సీఎస్‌పురం, జూలై 2 : తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభి స్తోందని పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య అన్నారు. మండలంలోని అయ్యలూరివారిపల్లి గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలు విసుగుచెందారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్‌కు తగిన బుద్ధి చెప్తారన్నారు. అన్ని మండలాల్లో టీడీపీ సభ్యత్వ నమోదుకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని వెంగయ్య అన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు స్వీకరించా లన్నారు. కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్ర మంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌ ఎన్‌.సీ.మాలకొండయ్య, నాయకులు అట్లూరి రామకృష్ణంరాజు, శ్రీరాములరెడ్డి, రమణయ్య, నారాయణ, పసుపులేటి వెంకటేశ్వర్లు, కె.వెం కటస్వామి, డి.నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T04:10:34+05:30 IST