జలకళ బోర్లకు త్వరితగతిన విద్యుత్ సౌకర్యం
ABN , First Publish Date - 2022-06-29T04:30:44+05:30 IST
వైఎస్ఆర్ జలకళ బోర్లకు త్వరితగతిన వి ద్యుత్ సౌకర్యం కల్పిస్తు న్నట్లు ఈఈ నల్లూరి మస్తాన్రావు చె ప్పారు.
ఈఈ మస్తాన్రావు
అద్దంకి, జూన్ 28: వైఎస్ఆర్ జలకళ బోర్లకు త్వరితగతిన వి ద్యుత్ సౌకర్యం కల్పిస్తు న్నట్లు ఈఈ నల్లూరి మస్తాన్రావు చె ప్పారు. జలకళ బోర్లపై మంగళ వారం స్థానిక శింగరకొండ రో డ్డులో ఉన్న విద్యుత్ కార్యాల యంలో విద్యుత్, డ్వామా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మస్తాన్రావు మాట్లాడుతూ అద్దంకి నియోజక వర్గంతో పాటు పర్చూరు నియోకవర్గంలోని మార్టూరు, యద్దనపూడి మండలాల నుంచి డ్వామా ద్వారా 450 జలకళ బోర్లు వేసినట్టు చె ప్పారు. మొదటి ఫేజ్ కింద రూ.2 లక్షలలోపు వ్యయం ఉన్న బోర్లను 102 గుర్తించామన్నారు. అందులో ఇప్పటి వరకు 56 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. మిగిలిన 46 బోర్లకు రెండు వారాలలో విద్యుత్ కనె క్షన్లు ఇస్తామన్నారు. ఇంకా మిగిలిన బోర్లను రె ండవ ఫేజ్ లో పూర్తి చేస్తామని చెప్పారు.
సమావేశంలో విద్యుత్ డీఈఈ గురవయ్య, డ్వామా ఏపీడీలు సుబ్బారావు, రావి భవాని, క్లస్టర్ టీఏ ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.