త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలి
ABN , First Publish Date - 2022-01-22T05:20:42+05:30 IST
ఇళ్ళ స్థల పట్టాలు పొందిన లబ్ధిదారులు త్వరితగతిన తమ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య అన్నారు. పట్టణంలోని రాజానగర్లో ప్రభుత్వ లేఅవుట్ను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు వేసుకున్న బేస్మెంట్లను పరిశీలించారు.
గిద్దలూరు టౌన్, జనవరి 21 : ఇళ్ళ స్థల పట్టాలు పొందిన లబ్ధిదారులు త్వరితగతిన తమ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య అన్నారు. పట్టణంలోని రాజానగర్లో ప్రభుత్వ లేఅవుట్ను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు వేసుకున్న బేస్మెంట్లను పరిశీలించారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవాలని, ఇళ్లు కలకాలం నిలబడాలంటే వాటర్ క్యూరింగ్ బాగా చేసుకోవాలని సూచించారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలను లేఅవుట్లలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో హౌసింగ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.