నాయుడుపాలెంలో కొండచిలువ పట్టివేత

ABN , First Publish Date - 2022-10-13T04:19:30+05:30 IST

మండలంలోని నాయుడుపాలెం పొలాల్లో సంచరిస్తున్న 7 అడుగుల కొండ చిలువను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. బుధవారం మండలంలోని నాయుడుపాలెంలో ఆవుల శేఖర్‌రెడ్డి అనే రైతు తన పొలంలోని కందిలో కొండ చిలువ కదలికలను గుర్తించి వెంటనే ఎర్రగొండపాలెం ఫారెస్టు స్నేక్‌ రెస్కువర్‌ మల్లిఖార్జునకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

నాయుడుపాలెంలో కొండచిలువ పట్టివేత
ఐటీవరంలో కొండ చిలువను పట్టుకున్న పారెస్టు స్నేక్‌ రెస్కువర్‌

20 రోజుల్లో 4 పట్టుకున్న అధికారులు

పుల్లలచెరువు, అక్టోబరు 12: మండలంలోని నాయుడుపాలెం పొలాల్లో సంచరిస్తున్న 7 అడుగుల కొండ చిలువను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. బుధవారం మండలంలోని నాయుడుపాలెంలో ఆవుల శేఖర్‌రెడ్డి అనే రైతు తన పొలంలోని కందిలో కొండ చిలువ కదలికలను గుర్తించి వెంటనే ఎర్రగొండపాలెం ఫారెస్టు స్నేక్‌ రెస్కువర్‌ మల్లిఖార్జునకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన పొలాల్లోకివెళ్లి కొండ చిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. దాన్ని నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు. గత నెలలో నాయుడుపాలెంలో 13 అడుగుల కొండ చిలువను పట్టుకోగా ఈ నెల 3 వ తేదీన 11 అడుగుల కొండ చిలువను పట్టుకున్నారు.గత నెల 30 న త్రిపురాంతకం మండలం మేడపి వద్ద 10 అడుగుల కొండ చిలువను పట్టుకున్నారు.గత 20 రోజుల్లోనే నాలుగుకుపైగా కొండ చిలువలు పొలాల్లో పట్టుబడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-10-13T04:19:30+05:30 IST