AP News: జగన్ కార్యక్రమానికి హాజరుకాని దర్శి ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-08-24T19:37:02+05:30 IST
దర్శి వైసీపీ (YCP)లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. చీమకుర్తికి సీఎం జగన్ వచ్చినా...
ప్రకాశం జిల్లా (Prakasam Dist.): దర్శి వైసీపీ (YCP)లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. చీమకుర్తికి సీఎం జగన్ (CM Jagan) వచ్చినా...అటు వైపు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ (Maddisetty Venugopal) కన్నెత్తి చూడలేదు. చీమకుర్తిలో వైఎస్ఆర్ (YSR), మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి (Subbareddy) విగ్రహాలు ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి (Siva Prasad Reddy) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సీఎం రావడంతో ఎమ్మెల్యే వేణుగోపాల్ హాజరుకాలేదు. దర్శి వైసీపీలో శివప్రసాద్ రెడ్డి గ్రూపులు కడుతున్నారని ఎమ్మెల్యే వేణుగోపాల్ గత కొంత కాలంగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పక్క నియోజక వర్గానికి సీఎం జగన్ వచ్చినా.... ఎమ్మెల్యే మద్దిశెట్టి కురిచేడు మండలంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో తిరుగుతున్నారు.