జగన్రెడ్డి పాలనలో బాదుడే బాదుడు
ABN , First Publish Date - 2022-05-17T06:12:01+05:30 IST
రాష్ట్రంలో జగన్రెడ్డి పాలనలో అన్ని రకాల ధరలు పెంచి ప్రజలను బాదేస్తున్నారని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. మండలంలోని ముప్పరాజువారిపాలెంలో సోమవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో ఇంటింటికీ తిరిగి పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్, రవాణా చార్జీల గురించి మహిళలకు వివరించారు
ఎమ్మెల్యే స్వామి విమర్శ
కొండపి, మే 16 : రాష్ట్రంలో జగన్రెడ్డి పాలనలో అన్ని రకాల ధరలు పెంచి ప్రజలను బాదేస్తున్నారని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. మండలంలోని ముప్పరాజువారిపాలెంలో సోమవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో ఇంటింటికీ తిరిగి పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్, రవాణా చార్జీల గురించి మహిళలకు వివరించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అదేసమయంలో టీడీపీ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డపాటి యలమందనాయుడు, బత్తుల నారాయణస్వామి, నరసారెడ్డి, రాఘవ, ఖాఈషా, కె.శంకర్, ముప్పరాజువారిపాలెం టీడీపీ నాయకులు వేజండ్ల రవీంద్ర, రావూరి నాగేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి నల్లూరి గురవయ్య పాల్గొన్నారు.