వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ల
ABN , First Publish Date - 2022-05-29T07:30:39+05:30 IST
నగర పంచాయతీ పరిధిలోని పాములపల్లె గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్లు రెండు రోజులుగా వైభవంగా జరుగుతున్నాయి.
గిద్దలూరు టౌన్, మే 28 : నగర పంచాయతీ పరిధిలోని పాములపల్లె గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్లు రెండు రోజులుగా వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలను దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్రెడ్డి, వైసీపీ నాయకులు పాలుగుళ్ల ప్రతాపరెడ్డి, దప్పిలి కాశిరెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు పేర్కొన్నారు.
చెన్నకేశవునికి శాంతి కల్యాణం
మార్కాపురం (వన్టౌన్), మే 28: మార్కాపురంలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆల యంలో శనివారం శాంతి కల్యా ణం వైభవంగా, కనుల పండువగా జరిగింది. అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు చెన్నకేశవస్వామి మూల విరా ట్కు సుప్రభాత సేవ, విశేష అలంకరణ, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలం కరించి కల్యాణ ఘట్టాలు నిర్వ హించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పి.కేశవరావు, ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి కార్యక్రమాలు పర్యవేక్షించారు.