రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి
ABN , First Publish Date - 2022-09-23T05:43:15+05:30 IST
సింగరాయకొండ జాతీయరహదా రిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ పాయింట్ సమీపంలోని కనుమళ్ల ఆంజనే యస్వామి విగ్రహం ఎదుట గురువారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచే సుకుంది.
సింగరాయకొండ, సెప్టెంబరు 22: సింగరాయకొండ జాతీయరహదా రిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ పాయింట్ సమీపంలోని కనుమళ్ల ఆంజనే యస్వామి విగ్రహం ఎదుట గురువారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచే సుకుంది. ఈ ప్రమాదంలో మూలగుంటపాడుకి చెందిన పసుపులేటి రవితేజ మృతిచెందాడు. గతంలో రవితేజకి గ్రామంలోని యువకులకు మ ధ్య ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో రవితేజ మృతిపై వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో డీఎస్పీ నాగరాజు, సీఐ లక్ష్మణ్, ఎస్సై ఫాతిమాఫిరోజ్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.