175 కొవిడ్ పాజిటివ్లు
ABN , First Publish Date - 2022-01-18T06:27:53+05:30 IST
ల్లాలో సోమవారం కొత్తగా 175 కొవిడ్ పాజిటివ్లు నమోదయ్యాయి.
ఒంగోలు (కార్పొరేషన్), జనవరి 17 : జిల్లాలో సోమవారం కొత్తగా 175 కొవిడ్ పాజిటివ్లు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా ఒంగోలులో 74 ఉన్నాయి.మార్కాపురంలో 30, చీమకుర్తిలో 9, అద్దంకిలో 7, మార్టూరులో 5, ఇతర జిల్లాల వారు 5 (నెల్లూరు 3, గుంటూరు 2), కందుకూరు, తర్లుపాడు, త్రిపురాంతకంలో నాలుగు చొప్పున నిర్ధారణ అయ్యాయి. బేస్తవారపేట, లింగసముద్రం, బల్లికురవలో మూడేసి, చీరాల, గిద్దలూరు, ఇంకొల్లు, జె.పంగులూరు, కొత్తపట్నం, శింగరాయకొండ, ఎర్రగొండపాలెంలో రెండు చొప్పున వచ్చాయి. కంభం, దర్శి, దొనకొండ, దోర్నాల, కొరిశపాడు, మద్దిపాడు, మర్రిపూడి, పామూరులో ఒక్కో పాజిటివ్ కేసు వెలుగు చూసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 1,39,882మంది వైరస్ బారిన పడ్డారు. వారిలో 1,37,777 మంది కోలుకున్నారు. 1,131 మంది మృతి చెందారు. ప్రస్తుతం 974 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
37,885 మందికి టీకాలు
ఒంగోలు (కలెక్టరేట్) : జిల్లాలో సోమవారం 169 కేంద్రాల్లో 37,885 మందికి టీకాలు వేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.రత్నావళి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 53,59,157 మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు వెల్లడించారు.