వైసీపీలో మహిళలకే పెద్దపీట : మేకపాటి

ABN , First Publish Date - 2022-08-18T03:44:41+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్‌ మహిళలకు పెద్దపీటవేసి అన్నిరంగాల్లో వారికి సముచిత స్థానం కల్పించినట్లు ఎమ్మెల్యే

వైసీపీలో మహిళలకే పెద్దపీట : మేకపాటి
సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి

కలిగిరి, ఆగస్టు 17: వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్‌ మహిళలకు పెద్దపీటవేసి అన్నిరంగాల్లో వారికి సముచిత స్థానం కల్పించినట్లు ఎమ్మెల్యే మేకపాటి చద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలిగిరి-1 గ్రామ సచివాలయాన్ని నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శాంతకుమారితో కలిసి  ఆయన ప్రారంభించారు. అనంతరం గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా మసీదువీధి, ఎస్టీ కాలనీలను సందర్శించారు. నూతనంంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అదజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాలూరు మాల్యాద్రిరెడ్డి, సర్పచు రాగి దివ్య, ఉపసర్పంచు పాలూరు కొండారెడ్డి, వైసీపీ కన్వీనర్‌ కాటం రవీంద్రరెడ్డి,తహసీల్దారు కృష్ణప్రసాద్‌, ఎంపీడీవో కళాధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


 22న వేంకటేశ్వర కల్యాణం


ఈనెల 22న ఉదయగిరిలో వేంకటేశ్వరస్వామి  కల్యాణం  నిర్వహిస్తున్నట్లు మేకపాటి తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలంతా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని  కోరారు.


Updated Date - 2022-08-18T03:44:41+05:30 IST