యూనివర్సిటీ రిజిస్ర్టార్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2022-07-01T04:41:32+05:30 IST
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ నూతన రిజిస్ర్టార్గా డాక్టర్ పి.రామచంద్రారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
వెంకటాచలం, జూన్30: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ నూతన రిజిస్ర్టార్గా డాక్టర్ పి.రామచంద్రారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కడపలోని యోగివేమన విశ్వవిద్యా లయంలో బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ఆచార్యులుగా పనిచేశారు. అక్కడ యూనివర్సిటీకి నాక్ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. బాధ్యతలు స్వీకరించిన రిజిస్ర్టార్కు ఉపకులపతి ఆచార్య జి. సుందరవల్లి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభిన ందనలు తెలిపారు. రిజిస్ర్టార్ మాట్లాడుతూ అందరి సహకారంతో విశ్వవిద్యాలయాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళతానన్నారు. మాజీ రిజిస్ర్టార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డిని యూనివర్సిటీ సిబ్బంది ఘనంగా సత్కరించింది. ఆయన బదిలీపై మాతృసంస్థ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్లారు.