నేడు ఐదు మెము రైళ్లు రద్దు
ABN , First Publish Date - 2022-09-18T05:18:17+05:30 IST
జిల్లాలో నిత్యం తిరిగే ఐదు మెము రైళ్లను ఆదివారం రద్దు చేస్తున్నట్టు విజయవాడ పీఆర్వో మండ్రుప్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నెల్లూరు ( వెంకటేశ్వరపురం)సెప్టెంబర్ 17 : జిల్లాలో నిత్యం తిరిగే ఐదు మెము రైళ్లను ఆదివారం రద్దు చేస్తున్నట్టు విజయవాడ పీఆర్వో మండ్రుప్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పడుగుపాడు- వేదా యపాళెం స్టేషన్ల మధ్య రైల్వే ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్నందున సూళ్లురుపేట - నెల్లూరు - సూళ్లురుపేట మధ్య తిరిగే 06745, 06746, 06747, 06748, 06751 మెము రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.