మూడు లీటర్ల నాటుసారా స్వాధీనం
ABN , First Publish Date - 2022-05-23T04:57:14+05:30 IST
బుచ్చిరెడ్డిపాళెం పట్టణం శాంతినగర్లోని బృందావనం కాలనీ మొదటి వీఽధిలో ఆదివారం సెబ్ అధికారులు సిబ్బందితో దాడులు నిర్వహించి మూడు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్టు సీఐ సూర్యనారాయణ తెలిపారు.
బుచ్చిరెడ్డిపాళెం, మే 22: బుచ్చిరెడ్డిపాళెం పట్టణం శాంతినగర్లోని బృందావనం కాలనీ మొదటి వీఽధిలో ఆదివారం సెబ్ అధికారులు సిబ్బందితో దాడులు నిర్వహించి మూడు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్టు సీఐ సూర్యనారాయణ తెలిపారు. దాడుల్లో గురునాఽథం వెంకటరమణయ్యను అదుపులోకి తీసుకుని మూడు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సారా తయారీకి అతనికి నల్లబెల్లం సరఫరా చేసిన పట్టణంలోని శేఖర్రెడ్డి ఆసుపత్రి ప్రాంతానికి చెందిన వేముల కిరణ్ అదుపులోకి తీసుకుని 25 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.