రైతులకు అండగా టీడీపీ

ABN , First Publish Date - 2022-06-23T04:11:22+05:30 IST

రాష్ట్రంలో రైతుల పట్ల సాగుతున్న ఆరాచక పాలనను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాజకీయ పార్టీ టీడీపీ అని తెలుగ రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రిరెడ్డి. శ్రీనివాసరెడ్డి అన్నారు.

రైతులకు అండగా టీడీపీ
సన్మానం అందుకుంటున్న శ్రీనివాసరెడ్డి

వరికుంటపాడు, జూన్‌ 22: రాష్ట్రంలో రైతుల పట్ల సాగుతున్న ఆరాచక పాలనను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాజకీయ పార్టీ టీడీపీ అని తెలుగ రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రిరెడ్డి. శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం విజయవాడ నుంచి కడప వెళ్తున్న ఆయన మార్గమధ్యంలో మండలంలోని రామాపురం వద్ద ఆగి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతూ వ్యవసాయానికి సైతం విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేసి మరింత ఇబ్బందులకు గురిచేయాలనే తలంపుతో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. అనంతరం స్థానిక రైతులు ఆయన్ను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.



Updated Date - 2022-06-23T04:11:22+05:30 IST