Somireddy chandramohan reddy: నెల్లూరులో నరకకూపాలుగా పోలీస్స్టేషన్లు
ABN , First Publish Date - 2022-08-18T19:19:13+05:30 IST
నెల్లూరు జిల్లాలో పోలీసు స్టేషన్లు నరక కూపాలుగా మారాయని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పోలీసు స్టేషన్లు నరక కూపాలుగా మారాయని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... పోలీసులే హత్యలు చేస్తున్నారని... చేసిన వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. అలాగే పోలీసులనే మంత్రి కాపాడుతున్నారని.. మంత్రి కాకాణి (Minister kakani) ఓ నరరూప రాక్షసుడిలా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లవారిపాళెంలో భార్య కళ్లెదుటే భర్తని చంపితే, నిందితుడిని పోలీసులు కాపాడారన్నారు. పోలీసు అధికారులు విచ్చలవిడిగా అక్రమాలు, వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వచ్చిన దానిలో పోలీసులు, మంత్రి ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఐలు ఎవరెవరు ఏ వ్యాపారాలు చేస్తున్నారో తన దగ్గర లిస్టు ఉందని తెలిపారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎస్పీలుగా వ్యవహారిస్తున్నారని... ఎస్పీ కానిస్టేబుల్గా మారారు అంటూ సోమిరెడ్డి దుయ్యబట్టారు.