ఎస్టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక
ABN , First Publish Date - 2022-06-26T04:50:55+05:30 IST
రాష్ర్టోపాధ్యాయ సంఘం (ఎస్టీయూఏపీ) జిల్లా నూతన కార్యవర్గం శనివారం ఎన్నికైంది.
నెల్లూరు (విద్య) జూన్ 25 : రాష్ర్టోపాధ్యాయ సంఘం (ఎస్టీయూఏపీ) జిల్లా నూతన కార్యవర్గం శనివారం ఎన్నికైంది. నెల్లూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో నూతన సభ్యులను ఎన్నుకోవడంతో పాటు కమిటీ పలు తీర్మానాలు చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధమైన జీవోనెం 117ను రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎల్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిం చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ నూతన అధ్యక్షుడిగా జి.రాజమనోహర్, ప్రధాన కార్యదర్శిగా ఎ.ఏడుకొండలు, ఆర్థిక కార్యదర్శిగా కె.నరసింహం, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలను అసోసియేషన్ నేతలు గంటా మోహన్, జగన్మోహన్రెడ్డి, దాసరి శ్రీనివాసులు, రమణారెడ్డి పర్యవేక్షించారు.