ఈదగాలిలో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

ABN , First Publish Date - 2022-05-26T04:45:29+05:30 IST

మండలంలోని ఈదగాలి గ్రామంలో బుధవారం రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు.

ఈదగాలిలో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు
నగదు బహుమతి అందజేస్తున్న టీడీపీ నేత చల్లా నాగార్జున్‌రెడ్డి

వెంకటాచలం, మే 25 : మండలంలోని ఈదగాలి గ్రామంలో బుధవారం రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక ఎడ్లబండ్ల కమిటీ, ఈదగాలి యూత్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించగా పలు ప్రాంతాల నుంచి 10 ఎడ్లబండ్లు పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి స్థానంలో కోవూరు మండలం చెర్లోపాళెం కట్టకింద గ్రామానికి చెందిన నాని, రెండోవ స్థానంలో ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన జనార్థన్‌రెడ్డి, మూడోవ స్థానంలో ఈదగాలి గ్రామానికి చెందిన పవన్‌, నాలుగోవ స్థానంలో అల్లూరుకి చెందిన సతీష్‌ నిలిచారు. విజేతలకు స్థానిక ఎంపీటీసీ వేమారెడ్డి రఘనందన్‌రెడ్డి రూ.15 వేలు, ఈదగాలికి చెందిన టీడీపీ మండల ఉపాధ్యక్షుడు చల్లా నాగార్జున్‌రెడ్డి రూ.10 వేలు, అలాగే గ్రామానికి చెందిన బొజ్జ ఆశోక్‌కుమార్‌రెడ్డి రూ.5 వేలు, ఈదగాలి ఎడ్లబండ్ల కమిటీ ఆధ్వర్యంలో రూ.3 వేలు నగదు బహుమతులు అందజేశారు. ఎడ్లబండ్ల పోటీలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలిరావడంతో ఈ ప్రాంతం  సందడి వాతావరణం నెలకొంది.

Updated Date - 2022-05-26T04:45:29+05:30 IST