గండికోటకు శ్రీశ్రీ సాహిత్య పురస్కారం
ABN , First Publish Date - 2022-05-23T04:54:28+05:30 IST
తెలుగుభాషలోని మాఽధుర్యం, సాహిత్యాన్ని బాల్య దశలోనే విద్యార్థులకు పరిచయం చేస్తూ మాతృ భాషపై వాత్సల్యాన్ని పెంపొందిస్తున్న ఉపాధ్యాయుడు గండికోట సుధీర్కుమార్ శ్రీశ్రీ సాహిత్య పురస్కారం అందుకున్నారు.
బుచ్చిరెడ్డిపాళెం,మే22: తెలుగుభాషలోని మాఽధుర్యం, సాహిత్యాన్ని బాల్య దశలోనే విద్యార్థులకు పరిచయం చేస్తూ మాతృ భాషపై వాత్సల్యాన్ని పెంపొందిస్తున్న ఉపాధ్యాయుడు గండికోట సుధీర్కుమార్ శ్రీశ్రీ సాహిత్య పురస్కారం అందుకున్నారు. కందుకూరులో శ్రీశ్రీ కళావేదిక ఆదివారం నిర్వహించిన జాతీయ శతావధిక కవిసమ్మేళనంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి, ఏపీ సాహిత్య అకాడమీ చైర్మెన్ పి. శ్రీలక్ష్మి, కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు కే. ప్రతాప్ నుంచి గండికోట పురస్కారం అందుకున్నారు. బుచ్చి ఎంఈవో, పలువురు సహ ఉపాఽధ్యాయులు గండికోటను అభినందించారు.