ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-01-25T03:50:40+05:30 IST
ప్రభుత్వం వెంటనే ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
గూడూరు, జనవరి 24: ప్రభుత్వం వెంటనే ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఽధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందన్నారు. కార్యక్రమంలో కాలేషా, సీవీఆర్ కుమార్, ఎంబేటి చంద్రయ్య, యాకోబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.