పొదలకూరు స్టేషన్లో ఎస్సీ కమిషన్ విచారణ
ABN , First Publish Date - 2022-08-07T05:32:48+05:30 IST
ఉదయగిరి నారాయణ బలవన్మరణంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పొదలకూరు పోలీసులను శనివారం జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి.సునీల్కుమార్బాబు విచారించారు.
పొదలకూరు, ఆగస్టు 6 : ఉదయగిరి నారాయణ బలవన్మరణంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పొదలకూరు పోలీసులను శనివారం జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి.సునీల్కుమార్బాబు విచారించారు. జేసీ కూర్మనాథ్, ఎస్పీ విజయరావులతో కలిసి పొదలకూరు పోలీసు స్టేషన్లో ఎస్ఐ కరీముల్లాను, ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ సంగమేశ్వరరావును విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు తలచీరు మస్తాన్బాబు జాతీయ కమిషనర్ డైరెక్టర్తో మాట్లాడుతూ పొదలకూరు ఎస్ఐ ప్రవర్తన సక్రమంగా లేదని, గతంలో తనపై అక్రమ అరెస్టుకు యత్నించినట్లు, నేదురుపల్లి గ్రామంలో తనపట్ల దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు. అలాగే తాటిపర్తి రైతుపై దాడి చేశారని పేర్కొన్నారు.