సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-30T03:44:32+05:30 IST

న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు శనివారం స్థానిక టవర్‌క్లాక్‌సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
ధర్నా చేస్తున్న ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు

మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిమాండ్‌

గూడూరు, జనవరి 28: న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు శనివారం స్థానిక టవర్‌క్లాక్‌సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా పట్ణణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమానపనికి సమాన వేతనం . కరువుభత్యం, మధ్యంతరభృతి ఇవ్వాలన్నారు. 60 ఏళ్లు నిండిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో యాదగిరి, గోపీనాథ్‌, కోటేశ్వరరావు, భూలోకం, మురళి, మణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-30T03:44:32+05:30 IST