సాయినాథుడి పాదుకలకు వీడ్కోలు
ABN , First Publish Date - 2022-05-19T02:47:07+05:30 IST
షిరిడీ సాయినాథుడి పాదుకలకు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వీడ్కోలు పలికారు. ఈనెల 11న
అల్లూరు, మే 18 : షిరిడీ సాయినాథుడి పాదుకలకు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వీడ్కోలు పలికారు. ఈనెల 11న సాయినాథుడి పాదుకలు అల్లూరుకి చేరుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా వారంపాటు విష్ణువర్థన్రెడ్డి నివాసంలో పూజలందుకుని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఈ సందర్భంగా విష్ణు నివాసం నుంచి బీసీ కాలనీలోని పోలేరమ్మ గుడి వరకు పాదుకలను శివప్రియ శిరస్సుపై ఉంచుకొని ఊరేగింపుగా తరలివెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం పాదుకలకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.