యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన
ABN , First Publish Date - 2022-12-08T23:36:21+05:30 IST
మండలంలోని తరుణవాయి రైతు భరోసా కేంద్రంలో వరి సాగుపై రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చీడపీడల నివారణ, ఎరువులు - యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై గురువారం అవగాహన కల్పించారు.
సంగం, డిసెంబరు 8: మండలంలోని తరుణవాయి రైతు భరోసా కేంద్రంలో వరి సాగుపై రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చీడపీడల నివారణ, ఎరువులు - యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై గురువారం అవగాహన కల్పించారు. జిల్లా వనరుల కేంద్రం, ఏరువాక కేంద్రం అధికారి మారుతీదేవి, సురేఖాదేవి, స్థానిక వ్యవసాయాధికారి శ్రీహరి రైతులతో కలిసి వరి పైరు సాగు పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతు భరోసాకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన, రసాయన ఎరువులు, చీడ పీడల సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు, వీఏఏలు పాల్గొన్నారు.