ఏరియా వైద్యశాల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు
ABN , First Publish Date - 2022-06-28T03:29:47+05:30 IST
కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల వైద్యులు ప్రతి కేసును నెల్లూరు పెద్దాసుపత్రికి సిఫార్సు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దళిళ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆర్డీవో శీనానాయక్కు ఫిర్యాదు చేశారు.
ఆర్డీవోకి దళిత సంఘర్షణ సమితి నేతల ఫిర్యాదు
కావలిటౌన్, జూన్ 27: కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల వైద్యులు ప్రతి కేసును నెల్లూరు పెద్దాసుపత్రికి సిఫార్సు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దళిళ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆర్డీవో శీనానాయక్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ ఏరియా వైద్యశాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడం లేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేని పేదలు ఏరియా వైద్యశాలలకు వస్తే వైద్యం అందించకుండా నెల్లూరుకు సిఫార్సు చేస్తున్నారని, పేరాసెట్మాల్ మాత్రలు తప్పితే మందులు లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు జె విజయరత్నం, ఎన్ లక్ష్మీనర్సు, బ్రహ్మయ్య, మాల్యాద్రి, కొండమ్మ, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.