అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2022-06-27T05:11:33+05:30 IST
లింగసముద్రం మండలం చినపవని గ్రామానికి చెందిన ఓ వివాహి త మహిళకు శీతలపానీయంలో మత్తుమందు
కందుకూరు, జూన్ 26: లింగసముద్రం మండలం చినపవని గ్రామానికి చెందిన ఓ వివాహి త మహిళకు శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి బెదిరించి అత్యాచారం చేసిన నెల్లూరుకు చెందిన షేక్ ఇలియాజ్ను ఆదివారం అరెస్టు చేశారు. కందుకూరులో డీఎస్పీ కండే శ్రీనివాసరావు, సీఐ శ్రీరామ్ నిందితుడిని చూయించి వివరాలు వెల్లడించారు. చినపవనికి చెందిన వివాహిత కుటుంబం నెల్లూరులో నివాసం ఉంటోంది. అయితే బాధితురాలి భర్తతో స్నేహం చేసిన నిందితుడు ఇలియాజ్ అతనికి మద్యం అలవాటు చేసి మత్తులో ఉన్న సమ యంలో మహిళకు శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారం చేశాడు. ఇటీవల చినపవనిలో బాధితురాలు వివాహ వేడుకల్లో ఉన్న సమయంలో కూడా నిందితుడు అక్కడకు వెళ్లి ఆమెను బెదిరించటంతో మనస్థాపం చెంది భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యా యత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.