అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కొనసాగించాలని ర్యాలీ
ABN , First Publish Date - 2022-05-28T05:00:05+05:30 IST
కోనసీమను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుచ్చిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు శుక్రవారం ర్యాలీ చేశారు.
బుచ్చిరెడ్డిపాళెం,మే27: కోనసీమను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుచ్చిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు శుక్రవారం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయసాధన కమిటీ అధ్యక్షుడు బీవీ రమణయ్య అమలాపురంలో కుల, మతోన్మాదులు సృంష్టించిన అల్లర్లను ఖండించారు. ఆ అల్లరి మూకలను, తెరవెనుక నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముందుగా స్థానిక జొన్నవాడ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత నాయకులు విల్సన్, తిరుపాలు, చెన్నయ్య, మాచర్ల, మైనారిటీ నాయకులు రసూల్, కిరణ్, రాజశేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.