రక్తదానంతో ప్రాణదానం
ABN , First Publish Date - 2022-01-27T03:00:46+05:30 IST
రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లు అని టీఎంఆర్ విద్యాసంస్థల అధినేత తంబిరెడ్డి మనోహర్రెడ్డి అన్నారు. నాయుడుపేట
నాయుడుపేట టౌన్, జనవరి 26 : రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లు అని టీఎంఆర్ విద్యాసంస్థల అధినేత తంబిరెడ్డి మనోహర్రెడ్డి అన్నారు. నాయుడుపేట శ్రీవేమ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మె గా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ అధికారి మధుసూదన్రావును శాలువాలతో సన్మనించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పోగ్రామింగ్ అధి కారి నరేంద్ర, ప్రిన్సిపాల్ రంజిత్రెడ్డి, మేనేజర్ జితేంద్రరెడ్డి, మల్లికార్జున్రావు తదితరులు పాల్గొన్నారు.
-----