పొదలకూరులో దొంగనోట్ల చలామణి
ABN , First Publish Date - 2022-11-28T21:43:48+05:30 IST
పొదలకూరు మండలంలో రూ.200 దొంగనోట్లు చలామణి అవుతున్నాయని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు. వాటర్ క్యాన్లు, వాటర్ ప్యాకెట్లు, కూల్డ్రింక్స్ సప్లై చేసేవారు ఎక్కువ మంది ఈ దొంగ నోట్లకు బలవుతున్నారు.
పొదలకూరు, నవంబరు 28 : పొదలకూరు మండలంలో రూ.200 దొంగనోట్లు చలామణి అవుతున్నాయని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు. వాటర్ క్యాన్లు, వాటర్ ప్యాకెట్లు, కూల్డ్రింక్స్ సప్లై చేసేవారు ఎక్కువ మంది ఈ దొంగ నోట్లకు బలవుతున్నారు. పని ఒత్తిడితో ఇచ్చిన నగదు దొంగ నోటా లేక మంచి నోటా అని తెలియక తీసుకుంటున్నారు. తీరా చూసుకున్నాక దొంగనోటు అని తెలియడంతో లబోదిబోమంటున్నారు. కూలి కోసం పని చేసేవారు రోజంతా కష్టపడితే కూలి డబ్బులైనా వస్తాయని అనుకుంటే అందులో కూడా దొంగనోట్లు రావడంతో తమకు సంబంధం లేదని యజమానులు చెబుతున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.