పంచాయతీ నోటీసు బోర్డు యథాతథం
ABN , First Publish Date - 2022-07-08T04:10:34+05:30 IST
పట్టణానికి చెందిన కన్నా సుధాకర్ 1985లో సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్లో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన 286 అంకణాల స్థలంలో గాలికి పడిపోయిన పంచాయతీ హెచ్చరిక బోర్డును గురువారం యథాతథంగా నాటారు.
పంచాయతీ నోటీసు బోర్డు యథాతథం
పొదలకూరు, జూలై 7 : పట్టణానికి చెందిన కన్నా సుధాకర్ 1985లో సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్లో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన 286 అంకణాల స్థలంలో గాలికి పడిపోయిన పంచాయతీ హెచ్చరిక బోర్డును గురువారం యథాతథంగా నాటారు. పంచాయతీ సెక్రటరీ అల్లాబక్షు తిరిగి నాటించారు. 2019లో ఆ లే అవుట్తో సంబంధం ఉన్న ఓ వ్యక్తి ఆ స్థలాన్ని ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టాడు. ప్రజాప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని అప్పట్లో తహసీల్దారు, సర్వేయర్, వీఆర్వో, పంచాయతీ సిబ్బంది ఆ లే అవుట్ను పరిశీలించి పంచాయతీ స్థలంగా నిర్ధారించారు. అనంతరం పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి వీచిన గాలికో లేక ఎవరో రాత్రి వేళలో ఆ హెచ్చరిక బోర్డును కింద పడేశారు. దాంతో వారు తిరిగి ఆ హెచ్చరిక నోటీసు బోర్డును నాటించారు. కోర్టులో ఉన్న ఈ వివాద స్థలంలోకి ఎవరూ ప్రవేశించకూడదని తెలిపారు.